ఒడిశాలోని కటక్లో జగన్నాథ్ తన తాత చనిపోవడంతో ఖర్చుల కోసం కొన్ని రోజుల క్రితం నిందితుల వద్ద రూ. 1500 మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా తిరిగి చెల్లించకపోవడంతో ఆదివారం రాత్రి అప్పిచ్చిన వ్యక్తి మరో ఐదుగురు స్నేహితులతో కలిసి వచ్చిన యువకుడితో గొడవ పడి, చితకబాదాడు. అనంతరం 12 అడుగుల తాడుతో జగన్నాథ్ చేతులను కట్టేశారు. తాడును బైక్కి కట్టారు. 20 నిమిషాల పాటు.. 2కి.మీల కన్నా ఎక్కువ దూరం నడిపించారు. కటక్లోని స్టువర్ట్పట్నా స్క్వేర్ నుంచి సుతాహట్ స్క్వేర్ వరకు బైక్వెనక పరిగెత్తాడు జగన్నాథ్. చివరికి కొందరు స్థానికులు చొరవ చూపించి, అతడిని విడిపించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు జగన్నాథ్. కిడ్నాప్, అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బైక్ని, తాడును కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ట్రాఫిక్పోలీసులు.. నిందితులను ఎందుకు అడ్డుకోలేదు? అన్న కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను అందరూ చూస్తున్నా ఎవరూ జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. ట్రాఫిక్ పోలీసులు చూసి కూడా అడ్డుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఇద్దరు నిందితులను గుర్తించామని, మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
అప్పు కట్టలేదనిబైక్కు కట్టి ఈడ్చుకెళ్లారు !
October 18, 2022
0
Tags