అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త !

Telugu Lo Computer
0


బీహార్ లోని నవాడా పరిధిలోని ఫతాహ గ్రామంలో గౌరీ శంకర్, సుగంధ కుమారి సిన్హా దంపతులకు 2014లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అత్తింటి వాళ్లు గౌరీ శంకర్ కు బాగానే ముట్టజెప్పారు. గౌరీ శంకర్ ప్రముఖ సింగర్ గా ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. వీరి కాపురం సజావుగా సాగుతుందన్న క్రమంలోనే అదనపు కట్నం తేవాలంటూ వేధిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో అత్తమామలు కలగజేసుకుని ఎన్నోసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా గౌరీ శంకర్ అదే పనిగా భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఇదే విషయంపై ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే భార్యపై కోపంతో ఊగిపోయిన భర్త గౌరీ శంకర్ భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం సుగుంధ తల్లిదండ్రులకు తెలియడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ రక్తపు మడుగులో ఉన్న కూతురును చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం సుగుంధ తల్లిదండ్రులు భర్త, అత్తింటి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)