ఆర్టీసీ బస్‌ రన్నింగ్‌లో ఊడిన టైర్లు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఏపీఎస్‌ ఆర్టీసీకి చెందిన బస్సు ప్రయాణికులతో వెళ్తుండగానే టైర్లు ఊడిపోయాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. షడన్ బ్రేక్ వేసి బస్‌ను ఆపేయడంతో లోపలున్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ప్రజా రవాణా సంస్థగా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ రవాణా సంస్థగా మార్చినప్పటికి రోడ్ల మరమ్మతులు చేయని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు తలెత్తుతున్నాయని జనసేనా నేత నాదెండ్ల మనోహర్‌ విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ప్రమాదాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)