కూలిన అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ : ఇద్దరు మృతి

Telugu Lo Computer
0


అరుణాచల్ ప్రదేశ్‌లో అప్పర్ సియాంగ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ శుక్రవారం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన మిగ్గింగ్ గ్రామం అటవీ ప్రాంతమని ఆర్మీ అధికారులు చెప్పారు. ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం లేకపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యమవుతోందని వివరించారు. ఇప్పటికే ఓ సహాయక బృందాన్ని ప్రమాద స్థలానికి పంపించినట్లు పేర్కొన్నారు. అయితే, ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఎంతమంది ఉన్నారనే వివరాలు తెలియరాలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)