విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మీ దంపతుల కుమారుడు చైతన్యకు విశాఖకు చెందిన కలగర్ల శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతుల కుమార్తె నిహారికతో ఇటీవల వివాహం ఖాయం చేశారు. ఈ జంటకు వచ్చే ఏడాది మార్చి 9న వివాహం జరగనుంది. అయితే చైతన్య-నిహారిక నిశ్చితార్థం పూర్తయ్యాక దసరా తొలి పండగ కావడంతో కాబోయే అల్లుడిని అత్తింటి వారు ప్రత్యేకంగా ఆహ్వానించి జన్మజన్మలకు గుర్తుండిపోయేలా విందు ఏర్పాటు చేశారు. 95 రకాల వంటకాలను ఇంట్లోనే తయారు చేయగా, మిగతా 30 రకాల వంటకాలను బయట ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించారు. ఇన్ని వంటకాలను చూసిన అల్లుడు ఆశ్చర్యపోయాడు. వాటిలో కొన్ని వంటకాలను తన లైఫ్లో తొలిసారి చూస్తున్నట్లు చైతన్య తెలిపాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గోదావరోళ్ల మర్యాదలను మించిపోయారుగా!
October 07, 2022
0
Tags