బంగ్లాదేశ్ లో విద్యుత్ గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలింది. మంగళవారంనాడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నేషనల్ పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల మందికి కరెంట్ లేకుండా పోయింది. అన్ని పవర్ ప్లాంట్లు ట్రిప్ అయ్యాయని, రాజధాని ఢాకా సహా పలు ప్రధాన నగరాల్లో కరెంట్ నిలిచిపోయందని విద్యుత్ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. సమస్యను ఇంజనీర్లు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారని, సమస్య గుర్తించి పరిష్కరించేందుకు కొన్ని గంటలు పడుతుందని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్లోని కొన్ని ఆగ్నేయ ప్రాంతాలు మినహాయిస్తే.. దేశం మొత్తం కరెంట్ లేక అంధకారంలోకి వెళ్లిపోయింది. మిగతా దేశం మొత్తం కరెంట్ లేకుండానే ఉన్నదని ఏజెన్సీ ప్రతినిధి షమిమ్ ఎహెసాన్ తెలిపారు. దేశంలో 130 మిలియన్ల పౌరులు కరెంట్ లేకుండానే ఉన్నారని, పవర్ పోవడానికి గల కారణాలు ఏమిటో కూడా తెలియరాలేదని ఆయన వివరించారు. సాంకేతిక లోపం అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
బంగ్లాదేశ్ లో పవర్ గ్రిడ్ ఫెయిల్
October 05, 2022
0