ఉత్తరప్రదేశ్‌లో దళితుడి దారుణ హత్య

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో దేవతా విగ్రహాన్ని తాకాడని దళితుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఉద్దా గ్రామంలో చోటుచేసుకుంది. దుర్గాపూజ మండపంలోని దేవతా విగ్రహాన్ని తాకినందుకు అగ్ర కులస్తులు కొట్టి హత్య చేశారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దురాగతంపై మృతుడు జగ్‌రూప్‌ భార్య మాట్లాడుతున్న వీడియోను ఓ హిందీ న్యూస్‌ పోర్టల్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దుర్గా పూజను చూసేందుకు తన భర్త సమీపంలోని ఓ ఇంటికి వెళ్లారని, అక్కడ అతన్ని కొట్టి చంపారని ఆరోపించారు. మున్నా, సందీప్‌ అనే ఇద్దరు వ్యక్తుల పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు. ఆ వీడియోలో మూటకట్టిన జగ్‌పూర్‌ మృతదేహం కూడా కనిపిస్తోంది. మరో వీడియోలో జగ్‌రూప్‌ అల్లుడు మాట్లాడుతూ.. తన మామ విగ్రహం పాదాలు తాకాడని, అక్కడున్న వారు విచక్షణారహితంగా కొట్టారని, తర్వాత ఇంటి వద్దకు తెచ్చి పడేశారని తెలిపారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని, అయితే అప్పటికే మరణించాడని డాక్టర్లు చెప్పారని తెలిపారు. అయితే ఈ హత్యకు కులం కారణం కాదని పైకి చెబుతున్న పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)