మునుగోడు ప్రచారంలో పాల్గొనని తేల్చి చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికపై ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కాంగ్రెస్ నేతలకు వెంకట రెడ్డి చేసిన ఫోన్ కాల్ లీక్ కలకలం రేపింది. ఈ ఘటన మరవకముందే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మునుగోడులో నేను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదు. మరి ప్రచారం చేయడం ఎందుకు. నేను ప్రచారం చేస్తే ఓ పది వేల ఓట్లు వస్తాయి. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు. పాదయాత్ర చేద్దామనుకున్న కానీ కాంగ్రెస్ లో ఒక్కొక్కరికి ఒక్కో గ్రూప్ ఉంది. రెండు అధికార పార్టీలు కొట్లాడుతున్నప్పుడు ఏం చేయగలం. నేను రాజకీయాల్లో 25 ఏళ్లు ఉన్నాను. నాకు ఇక రాజకీయాలు చాలు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఉప ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మునుగోడులో కాంగ్రెస్ గెలవదు
October 22, 2022
0
Tags