ముగ్గురు ప్రధాన న్యాయమూర్తుల నియామకం

Telugu Lo Computer
0


బాంబే హైకోర్టు న్యాయమూర్తి ప్రసన్న బాలచంద్ర వరాలే కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జమ్ముకాశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పంకజ్‌ మిథాల్‌ను రాజస్థాన్‌ హైకోర్టు జడ్జిగా బదిలీ చేసింది. జస్టిస్‌ అలీ మొహమ్మద్‌ మాగ్రే జమ్ము కాశ్మీర్‌ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా కేంద్రం నియమించింది. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల చివరలో సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్‌ వరాలే, జస్టిస్‌ మాగ్రేలు ప్రస్తుతం హైకోర్టులలో సీనియర్‌ న్యాయమూర్తులుగా ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)