ఉద్యోగులే సైబర్ దాడులకు పాల్పడ్డారు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో  ప్రముఖ కంపెనీ హాంగర్ టెక్నాలజీ సంస్థపై ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులే సైబర్ దాడులకు పాల్పడ్డారు. అయితే గత కొనేళ్లుగా కంపెనీలోని ఉద్యోగులు సైబర్ అటాక్ చేసి డేటా చేజిక్కించుకుంటున్నారు.  ఈ క్రమంలో హాంగర్ టెక్నాలజీ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ఆ కంపెనీకి చెందిన ఉద్యోగులే సైబర్‌ దాడులకు పాల్పడుతున్నట్లు సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. దీంతో కంపెనీకి సంబంధించిన అందాగ్ విజయ్ కుమార్, కరణ్‌కుమార్, అశ్వంత్‌కుమార్‌తో పాటు ఇద్దర్ని అరెస్ట్ చేశారు.  నిందితుల నుంచి రివ్వాల్వర్‌తో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అమెరికాలో ఉన్నా మరో నిందితుడి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)