ప్రజా ప్రతినిధులకు ఖరీదైన కానుకలిచ్చిన మంత్రి !

Telugu Lo Computer
0


కర్ణాటకలో ఆనంద్ సింగ్ పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన సభ్యులకు దీపావళి సందర్భంగా ఖరీదైన కానుకలు అందించాడు. ప్రతి సభ్యుడికి రెండు బాక్సులు అందించాడు. ఈ బాక్సుల్లో రూ.లక్ష నగదు, 144 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి, పట్టు చీర, ధోతితోపాటు, ఒక డ్రై ఫ్రూట్ బాక్స్ అందించాడు. వీరిలో పంచాయతి సభ్యులకు మాత్రం తక్కువ నగదు ఉన్న బాక్సు ఇచ్చాడు. అలాగే వీరికి బంగారం మినహా మిగతావన్నీ ఉన్న బాక్సు అందించాడు. ఇలాంటివి మొత్తం 300 బాక్సులు బహుమతులుగా ఇచ్చాడు. కాగా, కొందరు ప్రతినిధులు ఈ బాక్సులు తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలిసింది. అయితే, ఇంత ఖరీదైన కానుకలు ఇచ్చిన వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. అవినీతి సొమ్ముతోనే ఈ బహుమతులు ఇచ్చాడని, తన రాజకీయ ప్రయోజనాల కోసమే నాయకుల్ని ఆకట్టుకునేందుకు ఈ గిఫ్టులు ఇచ్చాడని పలువురు విమర్శిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఈ పని చేసినట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ బహుమతులకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)