నా మరణానికి కారణం ఆన్‌లైన్‌ రమ్మీ !

Telugu Lo Computer
0


తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మలైయాండిపట్టికి చెందిన రవి కుమార్ కొడుకు సంతోష్‌ (22) కురింజి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ ఈఈఈ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. సంతోష్ ఈ నెల 4వ తేది డబ్బులు కావాలని తల్లిదండ్రులతో గొడవపడి ఉంగరం, కొంత డబ్బు తీసుకొని బయటకు వెళ్లాడు. రెండు రోజుల తర్వాత 6వ తేదీన మనప్పారై రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి చనిపోయాడని పోలీసులు ఫోన్ చేశారు. అక్కడికి వెళ్లిన కుటుంబసభ్యులు, బంధువులు.. సంతోష్ మృతదేహం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసుల విచారణలో కుటుంబసభ్యులు నమ్మలేని విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంతోష్ గత ఆరు నెలలుగా ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసయ్యాడని తేలింది. దాంతో దొరికినచోటల్లా అప్పులు చేశాడని తెలిసింది. ఇంట్లో నుంచి తెచ్చిన ఉంగరం అమ్మి కూడా రమ్మీ ఆడినట్లు తెలిసింది. ఆ డబ్బులు కూడా పోవడంతో కుంగిపోయినట్లు సమాచారం. అందుకే చనిపోయే ముందు సంతోష్ తన వాట్సాప్‎లో స్టేటస్ పెట్టి చనిపోయాడు. 'నా మరణానికి కారణం ఆన్‌లైన్‌ రమ్మీ. నేను దానికి బానిసై ఎక్కువ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాను. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని' స్టేటస్ పెట్టాడు. గమనించిన స్నేహితులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. స్విచ్ఛాఫ్ వచ్చినట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)