విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలు, నేతల అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. జనసేన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ ఖండిస్తుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వ చర్యలను బీజేపీ సహించదని అన్నారు. విశాఖలో పవన్ కళ్యాన్ కార్యక్రమం పది రోజుల ముందే ఖరారైందని, దీనిపై తనకు సమాచారం ఉందని చెప్పారు. పోలీసులు అత్యుత్సాహంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఒక పార్టీ అధ్యక్షుడిని టచ్ చేసి కారులో కింద కూర్చోమనడం సహించరానిదన్నారు. పోలీసులు కూడా ఓవరాక్షన్ మానుకుంటే మంచిదని సూచించారు. మళ్లీ పవన్ కళ్యాణ్ను టచ్ చేస్తే.. బీజేపీ ప్రత్యక్ష రంగంలోకి దిగుతుందని సోము వీర్రాజు హెచ్చరించారు. కాగా, విశాఖ ఘటనపై పవన్ కళ్యాణ్కు సోము వీర్రాజు ఫోన్ చేశారు. పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. తాను విశాఖకు వస్తానని సోము వీర్రాజు చెప్పగా.. పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని, మీరు రావాల్సిన అవసరం లేదని పవన్ చెప్పారు. అక్కడి పరిస్థితులపై చర్చించినట్లు పవన్కు సోము వీర్రాజు తెలిపారు.
Post a Comment
0Comments
3/related/default