పోలీసుల అదుపులో గుజరాత్ 'ఆప్' చీఫ్ గోపాల్ !

Telugu Lo Computer
0


మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను గోపాల్‌కు జాతీయ మహిళా కమిషన్   సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ గోపాల్ ఇటాలియాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని సరితా విహార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ తనను జైలులో పెడతానని బెదిరించారని అన్నారు. జైలు తప్ప పటేల్ సామాజిక వర్గానికి మోదీ ప్రభుత్వం ఏమిచ్చిందని ప్రశ్నించారు. పటీదార్లను బీజేపీ అసహ్యించుకుంటోందని అన్నారు. తాను సర్దార్ పటేల్ వారసుడినని, జైళ్లకు భయపడేది లేదని, తనను జైలులో పెట్టుకోవచ్చని సవాలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)