బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 9 మంది మృతి

Telugu Lo Computer
0


కేరళలోని పాలక్కాడ్‌ నగరంలోని వడక్కంచెరి ప్రాంతంలో కేరళ ప్రభుత్వ బస్సును టూరిస్టు బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని మంత్రి ఎంబీ రాజేష్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు, ముగ్గురు కేఎస్ఆర్టీసీ ప్రయాణీకులు మరణించారు. మరో 35 మంది క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చారు. టూరిస్ట్ బస్సు ఎర్నాకులం జిల్లా బసేలియోస్ విద్యానికేతన్ నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులతో తమిళనాడులోని ఊటీ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.కేఎస్ఆర్టీసీ బస్సు కోయంబత్తూరు వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రేన్‌లను మోహరించి రెస్క్యూ సిబ్బంది బస్సులోకి ప్రవేశించి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం చేస్తున్నామని కేరళ మంత్రి ఎంబీ రాజేష్ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)