కంబోడియాలో పడవ మునిక : 8మంది పిల్లల దుర్మరణం

Telugu Lo Computer
0


కంబోడియాలోని మేకాంగ్ నదిలో పడవలో పిల్లలు ప్రయాణిస్తుండగా ఓవర్ లోడ్ వల్ల అదికాస్తా నీటిలో మునిగింది. ఈ పడవ ప్రమాదంలో 8మంది పిల్లలు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో మరణించిన పిల్లల వయసు 12 నుంచి 15 ఏళ్ల లోపు వయసు వారేనని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు బోటు ఆపరేటర్లు, ఇద్దరు విద్యార్థులు బయటపడ్డారు. భారీవరదల వల్ల పడవ మునిగిన ఘటనలో పిల్లలు మరణించిన ఘటనపై కంబోడియ ప్రధానమంత్రి హున్ సేన్ సంతాపం తెలిపారు. కంబోడియా దేశంలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2009వ సంవత్సరంలో నదిలో పడవ బోల్తాపడి 17మంది ప్రయాణికులు మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)