32 మందిని కాల్చి చంపిన మాజీ పోలీసు అధికారి

Telugu Lo Computer
0


థాయ్ లాండ్ లోని ఈశాన్య ప్రావిన్స్ లోని పిల్లల డే కేర్ సెంటర్ పై పాన్య కమ్రాబ్ అనే వ్యక్తి మారణాయుధాలతో దాడి చేశాడు. కనపడిన వారందరిని తన వద్ద ఉన్న తుపాకీతో నిర్ధాక్షిణ్యంగా కాల్చివేశాడు. ఘటనలో 32 మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. మృతుల్లో 23 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. దాడికి పాల్పడిన వ్యక్తి ఓ మాజీ పోలీసు అధికారిగా గుర్తించారు. మరో వైపు రెండు కథనాలు వినిపించాయి. ఘటనకు పాల్పడిన వ్యక్తి తన భార్యా పిల్లలను కాల్చి చంపి, తాను కూడా చనిపోయిన్నట్లు థాయిలాండ్ మీడియా  పేర్కొంది.  కానీ పోలీసుల మాత్రం హంతకుడు ఘటన అనంతరం ఓ తెల్లటి వాహనం ద్వారా పరారైన్నట్లు పేర్కొన్నారు. గాలింపు చర్యలు కూడా ప్రారంభించిన్నట్లు వారు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)