డైమండ్లున్న బ్యాగ్ పోయి, దొరికింది !

Telugu Lo Computer
0


ముంబైకి చెందిన అహ్మద్‌ బేగ్‌ అనే ఓ వ్యాపారి గత నెల 22న భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చారు. వారు బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో దిగారు. గత నెల 24వ తేదీన ఇదే హోటల్‌లో ఇండియన్‌ క్రికెట్‌ ఆటగాళ్లు బస చేశారు. దీంతో అక్కడున్న మిగతా వారికి సరైన సేవలు అందకపోవడంతో బేగ్ దంపతులు అక్కడ నుంచి వచ్చి సోమాజిగూడలోని పార్క్‌ హోటల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న బంగారు అభరణాలు బ్యాగ్ కనిపించకుండా పోయింది. వెంటనే బేగ్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాగులో డైమండ్‌ బ్రాస్‌లైట్, 35 డైమండ్లు, డైమండ్‌ రింగ్, మంగళసూత్రం ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. అయినా బ్యాగ్ అచూకీ లభించలేదు. మరోవైపు పంజాగుట్టు పోలీసులు కూడా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇది ఇలా ఉండగా మంగళవారం బంజారాహిల్స్‌ క్రైం పోలీసలు మరోసారి పార్క్‌హయత్‌ హోటల్‌లో తనిఖీలు చేపట్టగా.. బ్యాగ్ దొరికింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)