15న విశాఖ గర్జన ర్యాలీ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో రైతుల పాదయాత్రకు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు మద్దతు ఇస్తుండగా, మరి కొందరు మాత్రం మూడు రాజధానులతోనే వికేంద్రీకరణ సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈ నెల 15న 'విశాఖ గర్జన' ర్యాలీ చేపడుతున్నట్లు మంత్రి  బొత్స సత్యనారాయణ తెలిపారు. వైజాగ్ లోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి వైఎస్‌ఆర్‌ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. ఈ ర్యాలీకి మద్దతుగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అమరావతి పాదయాత్రను టీడీపీ పాదయాత్రగా ఆయన అభి వర్ణించారు. విశాఖపట్నం ను పాలన రాజధానిగా చేస్తే వస్తే నష్టమేంటని బొత్స ప్రశ్నించారు. ఇక్కడి ప్రజల మనోభావాలను అనుగుణంగా పని చేయాల్సి ఉంది. ఈ నెల 15న గర్జన ర్యాలీ నిర్వహిస్తున్నాం. అంబేడ్కర్‌ విగ్రహం నుంచి బీచ్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. దానికి అనుగుణంగా మనకు ఉన్న అన్ని అవకాశాలు క్రోడీకరించి, ర్యాలీని సక్సెస్‌ చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమంలో పార్టీ శ్రేణులన్నీ పాల్గొనాలి. అలాగే పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా తప్పనిసరిగా హాజరవ్వాలి. పార్టీ పరంగా కూడా అవసరం మేరకు మనమంతా ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి. విశాఖలోని అన్ని వార్డులలో సమావేశాలు నిర్వహించాలి. మంగళవారం సమావేశాలు. బుధవారం ప్రతి వార్డు సెంటర్‌లో మానవ హారాలు నిర్వహించాలి. ఇందులో పార్టీ నగర పెద్దలంతా పాల్గొనాలని బొత్స సత్యనారాయణ అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)