అమరావతి కేసు నవంబర్‌ 1న విచారణ

Telugu Lo Computer
0


అమరావతిపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నవంబరు1న విచారించనుంది. నిర్ణీత గడువులోగా అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ  ప్రభుత్వం ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై నవంబర్‌ 1 సిజెఐ జస్టిస్‌ యుయు లలిత్‌, జస్టిస్‌ అజరు రస్తోగి, జస్టిస్‌ రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. అలాగే హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై అమరావతి రైతులు సవాల్‌ చేసిన పిటిషన్‌ కూడా అదే రోజు విచారించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)