అమరావతిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు నవంబరు1న విచారించనుంది. నిర్ణీత గడువులోగా అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నవంబర్ 1 సిజెఐ జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ అజరు రస్తోగి, జస్టిస్ రవీంద్ర భట్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. అలాగే హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై అమరావతి రైతులు సవాల్ చేసిన పిటిషన్ కూడా అదే రోజు విచారించనున్నారు.
అమరావతి కేసు నవంబర్ 1న విచారణ
October 22, 2022
0
Tags