సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు

Telugu Lo Computer
0


శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు పాత్రా చాల్ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణకు సంబంధించి ఇప్పటీకే ఈడీ సంజయ్ రౌత్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోర్టు ఆదేశాలతో ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా వర్షను ఈడీ విచారించింది. పీఎమ్‌సీ బ్యాంక్ స్కామ్ కేసు గురించి ఈడీ గత జనవరిలో వర్షను విచారించింది. తాజా కేసుకు సంబంధించి మాధురి ప్రవీణ్ రౌత్ నుంచి వర్షా రౌత్ దాదాపు రూ.55 లక్షలు అక్రమంగా తీసుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. పాత్రా చాల్ కుంభకోణం విలువ దాదాపు రూ.1,034 కోట్లు. ఈ విచారణలో భాగంగా గతంలోనే సంజయ్ రౌత్ బంధువు ప్రవీణ్ రౌత్ అరెస్టై, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వర్షా రౌత్‌కు చెందిన రూ.11 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మరోవైపు సంజయ్ రౌత్ ఈడీ కస్టడీ ఈ నెల 8 వరకు పొడిగించినట్లు సమాచారం. వర్షా రౌత్‌కు ఈడీ తాజాగా జారీ చేసిన నోటీసుల ప్రకారం.. ఆమె ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. సంజయ్ రౌత్ ఈడీ విచారణను శివసేన నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఖండించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)