కేంద్రం నిధులను వైసీపీ సర్కారు దుర్వినియోగం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ నుంచే ఎక్కువమంది ముఖ్యమంత్రులు కావడంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. రాష్ర్టంలో ఐపీఎస్ లేదు వైసీపీనే ఉందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు మాట్లాడిందే మాట , చెప్పించే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నారనిమండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంపై మహిళా కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని రాజకీయ నిరుద్యోగ ఉపాధి కోసం వాడుకుంటోందని విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. 151 సీట్లు వచ్చాయని సంబరపడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని.. రాష్ట్రంలో సలహాదారులు ఎక్కువయ్యారు కానీ ఏం సలహాలు ఇస్తున్నారో అర్ధం కావడం లేదని విష్ణువర్ధన్‌రెడ్డి చురకలు అంటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)