ప్రయాణికున్ని ట్రైన్‌లో నుంచి తోసేసిన సిబ్బంది

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లా ఝాన్సీ ప్రాంతంలో రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ (12591) రైలులో రవి యాదవ్ (26) తన సోదరితో కలిసి ప్రయాణిస్తున్నాడు. జిరోలీ గ్రామానికి చేరుకోగానే పాంట్రీ సిబ్బందితో గొడవ జరిగింది. వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తున్న సమయంలో పాన్ మసాలా తింటున్నాడని ప్రశ్నించాడు. గొడవ పెరగడంతో రవి యాదవ్ చెల్లి లలిత్‌పూర్ స్టేషన్ రాగానే రైలు దిగిపోయింది. రవిని మాత్రం సిబ్బంది రైలు దిగనివ్వలేదు. దారుణంగా కొట్టడమే కాకుండా రైలులో నుంచి తోసేశారు. స్థానికులు అతణ్ని హాస్పిటల్ కు తరలించగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఝాన్సీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రవి యాదవ్ కంప్లైంట్ మేర కేసు నమోదు చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్లు 323, 325, 506 ప్రకారం.. పాంట్రీ స్టాఫ్ పై కేసు నమోదు చేసినట్లు గవర్నమెంట్ రైల్వే పోలీస్ సర్కిల్ ఆఫీసర్ మొహమ్మద్ నయీమ్ తెలిపారు. నిందితుల్లో ఒకరైన అమిత్ ను గుర్తుపట్టగా అరెస్ట్ చేసిన పోలీసులు పూర్తి వివరాల కోసం విచారణ జరుపుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)