కలెక్షన్స్‌ పుంజుకున్న'సీతారామం'

Telugu Lo Computer
0


మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ , మరాఠి భామ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం 'సీతారామం'. స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్ట్‌ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. పోటీలో ఉన్న 'బింబిసార' ఉండటం, ఆ చిత్రానికి కూడా హిట్‌ టాక్‌ రావడంతో తొలి రోజు 'సీతారామం' రూ.3.05 కోట్ల షేర్‌ వసూళ్లను రాబట్టింది. అయితే రెండో రోజు మాత్రం ఈ చిత్రానికి కలెక్షన్స్‌ పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండో రూ. 3.63 కోట్లు షేర్‌ వసూలు సాధించింది. గ్రాస్‌ పరంగా చూస్తే ఇది రూ. 7.25 కోట్లు. మొత్తంగా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.6.68 కోట్ల షేర్‌, రూ.13.30 కోట్ల గ్రాస్‌ వసూళ్లని రాబట్టంది. 'సీతారామం' క్లాసిక్‌ లవ్‌ స్టోరీ కాబట్టి ఏ సెంటర్‌ ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అయింది. బీ,సీ సెంటర్‌లో 'బింబిసార' జోరు వలన కలెక్షన్స్‌ పరంగా ఈ చిత్రం కాస్త వెనకబడింది.అయితే ఇలాంటి క్లాసిక్‌ చిత్రాలకు కలెక్షన్స్‌ మెల్లి మెల్లిగాపెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రానికి మొత్తంగా రూ.16.20 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగిందంట!. చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే రూ.17 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)