చేపల లారీ బోల్తా !

Telugu Lo Computer
0


తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఎన్టిపిసి లోని ఆటోనగర్ సమీపంలో ఆర్టీసీ బస్సును వెనుక నుండి ఢీ కొట్టి చేపల లారీ బోల్తా పడింది. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నుండి వస్తున్న చేపల లారీ శుక్రవారం ఆటోనగర్ వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుండి ఢీకొని అదుపు తప్పి బోల్తా పడింది. ఆర్టీసీ బస్సు గోదావరిఖని వైపు వస్తుండగా ఆటోనగర్ సర్కిల్ సమీపంలో ఓ మహిళ స్కూటర్ ఆగిపోవడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ చంద్రయ్య బ్రేక్ వేయడంతో విజయవాడ నుండి ఢిల్లీ వైపు వెళుతున్న చేపల లారీ ఆర్టీసీ బస్సు వెనుకవైపు ఢీకొట్టి కల్వర్ట్ లో బోల్తా పడింది. ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు సురక్షితం బయట పడగా లారీ క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని ఎన్ టి పి సి ఎ ఎస్ ఐ చక్రపాణి పరిశీలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)