భార్యపై కోపంతో పిల్లల్ని చంపిన భర్త

Telugu Lo Computer
0


కర్ణాటకలోని కలబురిగి లోని వెదురు మార్కెట్, భోవి గల్లిలో నివసించే లక్ష్మీకాంత్ (34) ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. అతను కొన్నేళ్ల కిందట అంజలి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి నలుగురు పిల్లలు పుట్టారు. ఈ క్రమంలో అంజలి మరోక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నాలుగు నెలల క్రితం అంజలి పిల్లల్ని,మొగుడ్ని వదిలేసి తన ప్రియుడితో పారిపోయింది. లక్ష్మీకాంత్ పిల్లల్ని తన అత్తగారింటి వద్ద దింపాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో లక్ష్మికాంత్ మంగళవారం తన పిల్లల వద్దకు వెళ్లాడు. వారిలో పదేళ్ల సోని, ఎనిమిదేళ్ల మయూరి అనే ఇద్దరు ఆడ పిల్లలను తన ఆటోలో పార్క్‌కు తీసుకు వెళ్లాడు. అక్కడ గొంతు పిసికి వారిని హత్య చేశాడు. వారి మృతదేహాలను ఆటోలో సీటు కింద ఉంచి ఆ రోజంతా ఆటో నడిపి ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. ఆటో ఎక్కిన ప్రయాణికులకు తెలియదు…తాము కూర్చున్న సీటు కింద మృతదేహాలు ఉన్నాయని. కాగా.. లక్ష్మికాంత్ బుధవారం మధ్యాహ్నం ఆటోలోని మృతదేహాలతో సహా ఎంబి నగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)