నిత్య పెళ్లికొడుకు శివశంకర్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శివశంకర్ బాధితులు పదకొండు మంది కాదు ఇంకా ఎక్కువే ఉన్నారన్న విషయాలు సంచలనంగా మారుతున్నాయి. ఇద్దరు మహిళలు ఆరోపణలు చేసిన మరుసటి రోజే, శివశంకర్ రియాక్టవడంతో ఈ కేసు ఇంట్రెస్టింగ్గా మారింది. తాను 11మందిని పెళ్లి చేసుకుని మోసం చేసుంటే ఇద్దరే ఎందుకు బయటికి వచ్చారు? మిగతవాళ్లెక్కడ? అంటూ లాజిక్ లాగడంతో, బాధితురాలు మరోసారి ఫైర్ అయ్యారు. తాజాగా బంధువులు, మహిళా సంఘాలతో కలిసి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. శివశంకర్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తాను గుంటూరు లోనే ఉన్నానని చెబుతున్నా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అతడు 11 మందినే కాదు మరికొందరు కూడా అతడి వలలో చిక్కుకున్నారని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే శివశంకర్ మోసాలకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఆ మహిళ ఆరోపిస్తోంది. శివ శంకర్ మొత్తం 11 మందిని పెళ్లిళ్లు చేసుకున్నాడు. దానికి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయిని, అయితే మిగతావాళ్లు పరువు పోతుందనే బయటికి రావడం లేదన్నారు. తమలాగే మరొకరు మోస పోకూడదనే తాను బయటికు వచ్చాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పరువును కూడా పక్కనబెట్టి ముందుకొచ్చి న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే, ఎందుకు నిందితుడిని అరెస్ట్ చేయలేదని బాధితురాలు వాపోసింది. గుంటూరు జిల్లా బేతపూడికి చెందిన శివశంకర్ వ్యవహారంలో రోజుకూ ట్విస్ట్ వస్తున్నా పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై పలు అనుమానాలు రేకేత్తుతున్నాయి. అతడికి 2018లోనే పెళ్లయిందని, ఈ విషయాన్ని దాచి మ్యాట్రిమోని సైట్లలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పరిచయం చేసుకున్నాడు. విడాకులు తీసుకుని, అందంగా ఉండే యువతులను ఎంచుకుంటాడు. ఇలా కొండాపూర్లో తమతోపాటు.. మరో యువతితో కాపురాలు పెట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అలాగే దగ్గర వేర్వేరుగా 25 లక్షల చొప్పున నగదు, .7 లక్షలు విలువ చేసే బంగారం తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ కేసును పోలీసులు తేలిగ్గా తీసుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శివశంకర్ పై కేపీహెచ్బీ, రామచంద్రపురం, గచ్చిబౌలి, మాదాపూర్, బాలానగర్, ఎల్బీనగర్, ఏపీలోని గుంటూరు, అనంతపురం, మంగళగిరి పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయి.
నిత్య పెళ్లికొడుకు శివశంకర్ ?
July 19, 2022
0
Tags