కల్తీ మద్యం కేసులో ఇద్దరు ఎస్పీలు బదిలీ

Telugu Lo Computer
0



గుజరాత్‌లోని బొటాడ్ జిల్లాతో పాటు అహ్మదాబాద్‌లోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు కల్తీ మద్యం సేవించడంతో 42 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనలో బొటాడ్ ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా, అహ్మదాబాద్ ఎస్పీ వీరేంద్ర సింగ్ యాదవ్‌లతో పాటు మరో ఆరుగురు పోలీసులను బదిలీ చేసినట్లు గుజరాత్ హోంశాఖ తెలిపింది.  మిథైల్ ఆల్కహాల్ లేదా మీథనాల్‌ను నీటిలో కలిపి.. మందు బాబులకు విక్రయించారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ. 20 చొప్పున అమ్మారు. ఇక పలు గ్రామాలకు చెందిన మందు బాబులు ఆ ప్యాకెట్లను విక్రయించి సేవించారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కల్తీ మద్యాన్ని విక్రయించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)