రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని సూరారం కాలనీకి చెందిన మహేష్‌ (31)కు మొయినాబాద్‌కు చెందిన పావనితో ఏడాది క్రితం వివాహమైంది. అతను సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. తనతోపాటు పనిచేసే స్నేహితుడు అఖిల్‌తో కలిసి ఆదివారం ద్విచక్ర వాహనంపై అన్నారం వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో గాగిల్లాపూర్‌ వద్ద వాహనం అదుపు తప్పి రోడ్డుపై ఉన్న బారికేడ్‌లను ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన అతన్ని తాను పనిచేసే ఆసుపత్రికే తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు అర్థరాత్రి మృతి చెందాడు. స్నేహితుడు అఖిల్‌ గాయాలతో బయటపడ్డాడు. అతనికి తల్లిదండ్రులు లేరు. 2 నెలల క్రితమే వివాహమైంది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)