మధ్యప్రదేశ్లోని రువా జిల్లా, జబల్పూర్లో రైల్వే స్టేషన్లో ఒక వృద్ధుడు పోలీసు కానిస్టేబుల్తో, అక్కడి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో కోపం తెచ్చుకున్న అనంత్ మిశ్రా అనే కానిస్టేబుల్ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. రైల్వే స్టేషన్లోనే వృద్ధుడిని తన్నాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి లాక్కుని వెళ్లి, ప్లాట్ఫామ్పై తలకిందులుగా వేలాడదీశాడు. ఆ తర్వాత కూడా అతడిపై కాలితో చాలాసార్లు తన్నాడు. చుట్టపక్కల ఉన్న వాళ్లెవరూ పోలీసును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అయితే, రైలులో ప్రయాణికుల్లో ఒకరు ఈ ఘటనను వీడియో తీశారు. తర్వాత ఆ వీడియోను షేర్ చేయడంతో అది వైరల్గా మారింది. దీంతో ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. దాడికి పాల్పడ్డ పోలీస్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు.
వృద్ధుడిని తలకిందులుగా వేలాడదీసిన కానిస్టేబుల్
July 30, 2022
0
Tags