రాజ్యసభ సభ్యునిగా విజయేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం

Telugu Lo Computer
0


రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపికైన ప్రముఖ సినీ రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'నేను రాసిన కథలే నన్ను రాజ్యసభకు తీసుకొచ్చాయి. ఇది కథ కాదు, నిజం. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు రావడం సంతోషంగా ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిస్థాయిలో పాల్గొని వివిధ అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నా. రాజ్యసభకు ఎంపికవుతానని నేను ఎప్పుడూ ఊహించలేదు. రాజ్యసభకు నామినేట్ కావడం నా బాధ్యతను మరింత పెంచింది. ప్రజలకు సంబంధించిన సమస్యలను రాజ్యసభ దృష్టికి తీసుకొస్తా'' అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)