కర్ణాటకలోని మధుగిరి తాలూకాలోని గొందిహళ్ళి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఫణీంద్రనాథ్ మద్యం తాగి స్కూల్ కి వచ్చి ప్రధానోపాధ్యాయున్ని చెప్పుతో బెదిరించి, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తనిపై అనేక సంవత్సరాలుగా ఇలాంటి ఫిర్యాదులున్నాయి. ఇతనిపై గతంలో హెడ్మాస్టర్లు కూడా పై అధికారులకు నివేదికలు పంపినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఇతడు ఆడింది ఆటగా సాగుతోంది. దీంతో రెండురోజుల క్రితం మద్యం తాగి నానా హంగామా చేశాడు. దీంతో హెచ్ఎం మధుగిరి విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.రేవణ్ణ సిద్దప్పకు ఫిర్యాదు చేయగా ఫణీంద్రనాథ్ను సస్పెండ్ చేశారు. వచ్చే శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
ఉపాధ్యాయుని వికృత చేష్టలు !
July 18, 2022
0
Tags