వర్షం నీటిలో విద్యార్థులు కుర్చీలు పట్టుకుంటే వాటిపై నడిచి వచ్చిన టీచర్‌ !

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్‌లోని మథుర జిల్లాలో వర్షం రావడంతో ప్రభుత్వ స్కూల్‌ ప్రాంగణమంతా నీటితో నిండింది. బుధవారం ఆ స్కూల్‌ విద్యార్థులు వర్షం నీటిలో నడుచుకుంటూ క్లాస్‌ రూమ్‌లకు చేరుకున్నారు. అయితే టీచర్లు మాత్రం అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలపై నడిచి వచ్చారు. వర్షం నీటితో నిండిన కాంపౌడ్‌లో వరుసగా పేర్చి విద్యార్థులు పట్టుకున్న కుర్చీల మీదుగా ఒక ఉపాధ్యాయురాలు నడుచుకుంటూ స్కూల్‌లోకి ప్రవేశించింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇది అధికారుల దృష్టికి వెళ్లగా ఆ టీచర్‌ను సస్పెండ్‌ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)