రైలు పట్టాలు క్రాస్ చేస్తుండగా జవాన్ మృతి

Telugu Lo Computer
0


హర్యానాలో ఓ బిఎస్ఎఫ్  జవాన్ రైలు పట్టాలు క్రాస్ చేస్తుండగా ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఇటీవల సెలవులపై వచ్చిన జవాన్ వీర్ సింగ్ తన సోదరిని చూసేందుకు మజ్రా ఖుర్ద్ గ్రామం వెళ్తుండగా సమీపంలోని రైలు పట్టాలను క్రాస్ చేస్తున్నాడు. ఆ సమయంలో రేవారి వైపు నుంచి వేగంగా వస్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ రైలు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ టీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి. వెంటనే రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మహేంద్రగఢ్‌ ఆస్పత్రికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)