ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సాంబాజీనగర్‌గా, ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మార్చాలని  ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఔరంగాబాద్ పేరును  సాంబాజీనగర్‌గా మార్చాలని ఎన్నో ఏళ్ళుగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. నావీ ముంబైలోని కొత్త విమానాశ్రయానికి డీబీ పాటిల్ పేరు పెట్టాలని ఏక్‌నాథ్ షిండే కేబినెట్ నిర్ణయించింది. కాగా, ఇవే నిర్ణయాలను గత నెల జూన్ 29న అప్పటి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో కేబినెట్ కూడా తీసుకున్న విషయం విదితమే. రాజీనామా చేయడానికి ముందు ఉద్ధవ్ ఆ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు అవే నిర్ణయాలను ఏక్‌నాథ్ షిండే కేబినెట్ కూడా తీసుకోవడం గమనార్హం. ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్ పేర్లను మార్చడానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగనుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)