చంపి, మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పెట్టారు....! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 23 July 2022

చంపి, మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పెట్టారు....!


ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో ఫ్రిజ్‌లో మృతదేహాన్ని గుర్తించిన ఓ మహిళ గత రాత్రి 7.15 గంటలకు తమకు ఫోన్ చేసి సమాచారం అందించిందని పోలీసులు మీడియాకు వివరాలు తెలిపారు. దీంతో వెంటనే తాము ఆ ఇంటికి వెళ్ళి దర్యాప్తు ప్రారంభించామని వివరించారు. 50 ఏళ్ళ వ్యక్తిని చంపేసి, మృతదేహాన్ని ప్రిజ్‌లో పెట్టి నిందితులు వెళ్ళిపోయినట్లు గుర్తించామని తెలిపారు. బాధితుడి కుటుంబానికి చెందిన వారు అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అతడి ఇంటికి వెళ్ళారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఫ్రిజ్‌లో అతడి మృతదేహాన్ని గుర్తించారని తెలిపారు. మృతుడి పేరు జకీర్ అని చెప్పారు. అతడు కొంత కాలంగా ఆ ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. జకీర్ భార్య, అతడి పిల్లలు వేరే ప్రాంతంలో ఉంటున్నారని తెలిపారు. జకీర్ హత్య ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని వివరించారు.

No comments:

Post a Comment