కన్వర్ యాత్ర సందర్బంగా శ్రవణుడిని గుర్తుచేశాడు ఓ వ్యక్తి. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి అశోక్ కుమార్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో వ్యక్తి వృద్దులైన తన తల్లిదండ్రులను కావడికి చెరో పక్కన కూర్చోబెట్టాడు. ఆ కావడిని మోస్తూ కన్వర్ యాత్రలో పాల్గొన్నాడు. లక్షలాది మంది శివభక్తుల్లో ప్రత్యేకంగా నిలిచాడు. అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ వ్యక్తిని చూసి అందరూ శ్రవణుడిని గుర్తుచేసుకున్నారు. కలియుగ శ్రవణుడు అని పిలిచారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
Post a Comment
0Comments
3/related/default