దువ్వాడ రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తోన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేస్తోన్న ఆర్పీఎఫ్ పోలీసులకు.. అప్పుడే స్టేషన్‌లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తుల కదలికలపై అనుమానం కలిగింది. ఆ ఇద్దరూ కంగారుగా చెన్నై ట్రైన్ ఎక్కడాన్ని గమనించారు. దీంతో సదరు ప్రయాణీకులను ఆపి.. లగేజ్‌ను చెక్ చేయగా.. పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. వారి ట్రావెల్ బ్యాగ్స్‌లో ఉన్న 38 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, రూ. 8 వేల క్యాష్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. కాగా, నిందితులు చెన్నైలోని గంజాయి రవాణా ముఠాకు చెందిన విశాల్‌కుమార్‌ సింగ్‌, నితీశ్‌కుమార్‌ పాండేలుగా పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)