గుజరాత్ పద్మశాలి 4వ మహాసభలు సూరత్ నగరంలో ఘనంగా జరిగాయి. సభ సమగ్ర కార్యక్రమ సంచాలకులుగా రాపోలు బుచ్చిబాబు వ్యవహరించిన ఈ కార్యక్రమంలో అహ్మదాబాద్, సూరత్, నవసారీ, గణదేవీ బిల్లిమోర, వడోదరా తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పద్మశాలీలు హాజరయ్యారు. మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్, అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షుడు కందగట్ల స్వామి, మాజీ అధ్యక్షుడు శ్రీధర్ సుంకర్ నారు తదితరులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మశాలీల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంఘీక సమస్యలపై ఈ సభలో చర్చించారు. గుజరాత్ 4వ పద్మశాలీ సంఘం ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, కన్వీనర్ వెన్నం శ్రీరాములు మాట్లాడుతూ.. గుజరాత్ పద్మశాలీ కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలీలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారిలో సోదర భావం పెంపొందించేందుకే ఈ సభను నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా గుజరాత్ ప్రాంతీయ పద్మశాలీ సంఘ 4వ అధ్యక్షుడిగా గోనె సోమయ్య, ప్రధాన కార్యదర్శి ఎలిగేటి నాగేశ్లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఘనంగా గుజరాత్ పద్మశాలీ మహాసభ
July 12, 2022
0
Tags