జారిపడిన లాలూ ప్రసాద్ యాదవ్

Telugu Lo Computer
0


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ ఇంట్లోని మెట్లపై నుంచి జారిపడ్డారు. దీంతో ఆయన భుజం ఎముక విరిగింది. దీంతో ఆయన్ను పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 74 యేళ్ళ లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పైగా, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ యేడాది మొదట్లో డిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. దాణా స్కామ్‌లో దోషిగా తేలడంతో మొదట్లో 2017 డిసెంబరు నెలలో ఆయనకు జైలుశిక్ష ఖరారైంది.  ఏప్రిల్ నెలలో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయన పాట్నాలోని తన నివాసంలోనే ఉంటూ, ఆదివారం మెట్లపై నుంచి జారి పడ్డారు. దాంతో భుజం ఎముక విరగడంతో పాటు వెన్నెముకకు కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)