32 మంది ఐపీఎస్ అధికారులపై బదిలీవేటు

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్‌లాల్ హత్య కేసు ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యపై దేశ వ్యాప్తంగా నిరసనలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ప్రభుత్వం సుమారు 32 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ హత్య కేసులో పోలీసులపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. బీజేపీ నేత నుపుర్ శర్మకు మద్దతుగా వ్యాఖ్యలు చేసినందుకు టైలర్ కన్హయ్యను ఇద్దరు వ్యక్తులు దారుణంగా మెడ నరికి హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రియాజ్ అక్తారీ, గౌస్ మొహ్మద్‌లను కూడా అరెస్టు చేశారు. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టింది. పాకిస్థాన్‌లోని దావత్ ఏ ఇస్లామీ గ్రూపుతో నిందితులకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)