ఘోర బస్సు ప్రమాదంలో స్కూల్ విద్యార్థులు సహా 16 మంది మృతి

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్‌లో ఈరోజు ఉదయం 8.30 గంటలకు కుల్లూ జిల్లాలోని నియోలీ-షంషెడ్ రోడ్డు మీదుగా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అక్కడి జంగ్లా ప్రాంతంలోని సయింజ్ లోయలో అదుపుతప్పి పడిపోయింది. దీంతో పాఠశాల విద్యార్థులు సహా 16 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొంతమందికి గాయాలయ్యాయి. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదస్థలి వద్ద పోలీసులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాదానికి గురైన బస్సు నుజ్జునుజ్జయింది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో దాదాపు 40 మంది ఉన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)