పేటీఎం మొబైల్ రీఛార్జులపై అదనపు ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. రీఛార్జిని బట్టి రూ.1 నుంచి రూ.6 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పేటీఎం ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఈ మొత్తాన్ని ఇప్పటికే కొంతమంది యూజర్ల నుంచి వసూలు చేసింది. గూగుల్ పే, అమెజాన్ పే వంటి సంస్థలు మాత్రం ఇప్పటికైతే మొబైల్ రీఛార్జులపై ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయడం లేదు. ఫోన్పే రూ.50 పైబడి చేసే రీఛార్జులపై సర్చార్జీలను వసూలు చేయడం గతేడాది నుంచి ప్రారంభించింది. పేటీఎం వ్యాలెట్, యూపీఐ, క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు.. ఇలా ఏ పేమెంట్ విధానం అయినా సర్ఛార్జి వసూలు చేస్తున్నట్లు పలువురు యూజర్లు ట్విటర్లో పేర్కొంటున్నారు.
మొబైల్ రీఛార్జులపై పేటీఎం ఎక్స్ట్రా ఫీజు ?
June 12, 2022
0