బీహార్లోని బక్షర్ జిల్లాలో దుమ్రావ్ గ్రామంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్న సోనూ రాయ్ అనే వ్యక్తికి మోను రాయ్ అనే తమ్ముడు ఉన్నాడు. మోను ఇటీవలే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లిద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఈ వివాహానికి ఒప్పుకోలేదు. అయినా వాళ్లు పెళ్లి చేసుకోవడంతో అమ్మాయి తండ్రి, రిటైర్డ్ ఆర్మీ అధికారి సునీల్ పాఠక్ ఆగ్రహం తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే తన కుమారుడు ధాను పాఠక్తో కలిసి మోనూను హతమార్చాలని ప్లాన్ చేశాడు. అతను బార్బర్ షాపులో ఉండగా.. తండ్రీకొడుకులు ఇద్దరూ తుపాకులతో దాడి చేశారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో తలలో తూటాలు దింపారు. ఆ తర్వాత మోనూ శరీరాన్ని ఒక మూలకు లాక్కెళ్లి కాళ్లతో తంతూ తుపాకులను రీలోడ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. అవి స్టక్ అవడంతో మోనూ మళ్లీ లేవకుండా తొక్కిపట్టి, రీలోడ్ చేసుకున్నారు. ఆపై మళ్లీ అతన్ని కాల్చారు. దీంతో మోనూ అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఆ తర్వాత స్వయంగా పోలీసులకు ఫోన్ చేసిన సునీల్ పాఠక్ సరెండర్ అయ్యాడు. కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు.. తండ్రీకొడుకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు హత్య !
June 07, 2022
0
Tags