భర్తను చంపి ఫ్యాన్‌కు ఉరివేసింది !

Telugu Lo Computer
0


బీహార్‌లోని సరన్ జిల్లా భగవాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజయాబ్‌గంజ్ స్థానిక ఒకటో వార్డులో సంతోష్ దాస్ (29) అనే యువకుడి గోపాల్ గంజ్‌ జిల్లాకు చెందిన సిమ్రాన్ కుమార్ (23)కి ఏప్రిల్ 23న వివాహం జరిగింది. ఆలయంలో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. పెళ్లైన కొన్ని రోజులు పాటు వీరిద్దరు బాగానే ఉన్నారు. అయితే సిమ్రాన్ ఎప్పుడూ ఫోన్‌ మాట్లాడుతుండడంతో భర్తకు అనుమానం వచ్చింది. వేరొక వ్యక్తితో మాట్లాడుతుందని అనుమానించాడు. ఆమె వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ లొక్కొని, బేసిక్ ఫోన్ ఇచ్చాడు. ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఐతే మంగళవారం ఇంట్లో సంతోష్ తప్ప ఎవరూ లేవరు. అదే సమయంలో సిమ్రాన్ ఓ యువకుడిని ఇంటికి పిలిచింది. తమ బంధువని భర్తకు పరిచయం చేసింది. సిమ్రాన్ నిత్యం తరచూ ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండడం, బంధువని చెప్పి ఓ యుకువడిని ఇంటికి పిలవడంతో.. భర్తకు అనుమానం పెరిగింది. ఆమెను నిలదీద్దామనుకునే లోపే సిమ్రాన్, ఆ యువకుడు కలిసి సంతోష్‌ను చంపేశారు. అనంతరం ఫ్యాన్‌కు వేలాడదీసి, ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులను తీసుకొని ఇంటికి తాళం వేసి పారిపోయింది. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులంతా ఇంటికి వెళ్లి చూస్తే.. తాళం వేసి ఉంది. సంతోష్‌కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. సిమ్రాన్ ఫోన్ స్విచాఫ్ వస్తోంది. ఏదో జరిగిందని వారిలో అనుమానం కలిగింది. ఇంటి తలుపులను బద్దలు కొట్టి, లోపలి వెళ్లి చూస్తే.. ఫ్యాన్‌కి వేలాడుతూ సంతోష్ శవం కనిపించింది. అందరూ షాక్ అయ్యారు. కుటుంబ సభ్యులంతా సిమ్రాన్‌పైనే అనుమానం వ్యక్తం చేశారు. సిమ్రాన్ ఇంటికి తాళం వేసి వెళ్తుండగా కొందరు స్థానికులు చూశారు. అందువల్లే ఆమే హత్య చేసిందని చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సంతోష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సిమ్రాన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తునట్లు పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)