జమ్మూలో బస్సు నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం

Telugu Lo Computer
0


జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూ జిల్లా ఝజ్జర్ కొత్లి వద్ద పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బస్సులో జిలిటెన్‌ స్టిక్స్‌తో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. వెంటనే బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ను (BDS) బృందాన్ని రప్పించారు. నియంత్రిత సిబ్బందితో ద్వారా పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ఝజ్జర్‌ కొత్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదవగా.. విచారణ జరుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)