కేరళ ప్రభుత్వ మొదటి వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టాన్ని కేరళలో అమలు చేయమని తేల్చి చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలో పేర్కొన్న లౌకికవాద సిద్ధాంతంపైనే ఇండియా పనిచేస్తోంది. సెక్యులరిజాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై కొంతమంది ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన ఘటనలో ఓ వర్గం ప్రజలు మతం ఆధారంగా పౌరసత్వాన్ని నిర్ణయిస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేరళ ప్రభుత్వం గట్టి వైఖరి చూపించనుందని పినరయి వివరించారు. ప్రజల మధ్య మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో అనేక సర్వేలు జరుగుతున్నాయి. కానీ మన సమాజంలో అత్యంత పేద కుటుంబాలను గుర్తించడానికి ఒక సర్వే పూర్తయింది. ఈ సర్వేలో భాగంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టాన్ని కేరళలో అమలు చేయం !
June 03, 2022
0
Tags