రఘురామకృష్ణరాజును టీవీ చర్చలకు రానివ్వకండి !

Telugu Lo Computer
0


పార్లమెంట్‌ టీవీ చర్చల్లో ఎంపీ రఘురామకృష్ణరాజును అనుమతించవద్దని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంసద్‌ టీవీ ముఖ్య కార్యనిర్వహణాధికారికి (సీఈవో) లేఖ రాశారు. చర్చల్లో రఘురామను వైకాపా ఎంపీగా చూపుతున్నారని తెలిపారు. ఆయన వైకాపా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించడం లేదని పేర్కొన్నారు. ఆయనపై అనర్హతకు సంబంధించిన పిటిషన్‌ సభాపతి వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ లోక్‌సభ కాలపరిమితి ముగిసే వరకు రఘురామను చర్చల్లో భాగస్వామిని చేయొద్దని కోరారు. తనను పార్టీ నుంచి బహిష్కరించకుండా చర్చల్లో అనుమతించొద్దంటూ లేఖలు రాయలేరని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. విజయసాయిరెడ్డి లేఖపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కావాలంటే తనను బహిష్కరించాలని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)