స్నానానికి వెళ్లి ఏడుగురు గల్లంతు

Telugu Lo Computer
0

తమిళనాడులోని నెల్లికుప్పం సమీపంలోని గ్రామాలకు చెందిన మహిళలు, బాలికలు ఆదివారం మధ్యాహ్నం కెడిలం నది ఆనకట్ట సమీపంలోకి స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలోనే నీటిలోకి దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయారు. విషయాన్ని గమనించిన పలువురు స్థానికులు మునిగిన వారందరినీ రక్షించి కడలూరులోని ఆసుపత్రికి తరలించారు. అయితే, వారిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. మృతుల్లో ఐదుగురు కూచిపాళయానికి చెందిన వారు కాగా ఇద్దరు అక్కా చెల్లెల్లు ఆయంకురింజిపాడి గ్రామానికి చెందిన వారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న మృతుల బంధువులు, కుటుంబం సభ్యులు కడలూరు ప్రభుత్వ దవాఖానకు వద్దకు చేరుకున్నారు. సరదాగా స్నాసానికి వెళ్లి వస్తామని చెప్పి విగతజీవులు కావడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే, నదిలో స్నానానికి వెళ్లి సమయంలో ఇద్దరు ఈత కొట్టే ప్రయత్నంలో డ్యామ్ సమీపంలో సుడిగుండం కారణంగా ఇద్దరు నీటిలో మునిగిపోగా.. వారిని కాపాడే ప్రయత్నంలో వారిని రక్షించేందుకు వెళ్లి ఐదుగురు కూడా నీటిలో మునిగిపోయినట్లుగా సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)