అమెరికాలో నల్గొండ వాసిని కాల్చి చంపిన దుండగులు

Telugu Lo Computer
0


తెలంగాణలోని నల్గొండకు చెందిన నక్క సాయి చరణ్ (26) అమెరికాలో రెండేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మిత్రుడిని ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసి కారులో తిరిగి వెళ్తుండగా  మేరీల్యాండ్ రాష్ట్రానికి చెందిన బాల్టిమోర్ సిటీలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. ఉదయం 4 గంటల 30నిమిషాల సమయంలో మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ పోలీసులు ఓ వాహనంలో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. హ్యుందాయ్ టక్సన్ కారులో 25 ఏళ్ల వ్యక్తి తలపై తుపాకీతో కాల్పులు జరిపినట్లుగా కనుగొన్నారు. వెంటనే యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఆర్. ఆడమ్స్ కౌలీ షాక్ ట్రామా సెంటర్ కు తీసుకెళ్లగా.. కొద్దిసేపటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మర్డర్ కేసుగా పరిగణిస్తూ దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)